పరిగి, ఆగస్టు:తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు కొనియాడారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పరిగిలోని తెలంగాణ అమరవీరుల క్రాస్రోడ్డులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జెడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డిలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామానికి తెలంగాణ భావజాలం వ్యాప్తి చెందడంలో ప్రొఫెసర్ జయశంకర్ కృషి ఉందన్నారు. నీరు, నిధులు, ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా నిరూపించడం ద్వారా ఉద్యమం మరింత ఉదృతంగా కొనసాగడానికి ఆయన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సమీర్, మాజీ వైస్ చైర్మన్ పి.వెంకటయ్య, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంగు సంతోష్కుమార్, కౌన్సిలర్లు వేముల కిరణ్, ఎదిరె క్రిష్ణ, వారాల రవీంద్ర, మునీర్, వెంకటేశ్, నాగేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు ఆకారపు రాజు, హన్మంత్రెడ్డి, జంగయ్య, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.