పరిగి, ఆగస్టు: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి శనివారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున బ్రేక్ దర్శన సమయంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వారితోపాటు మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంగు సంతోష్, కౌన్సిలర్ వేముల కిరణ్, టీఆర్ఎస్ నాయకులు రవికుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు.