ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నామినీకి పది రోజులలో రూ.5లక్షలు రైతు బీమా చెల్లించే విధంగా పథకాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో 19సంవత్సరాల నుంచి 59సంవత్సరాలలోపు ఉన్న, చిన్న, సన్నకారు రైతు ఏ కారణంతో మృతి చెందినా ఒక్కసారిగా కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
ఈ బాధ నుంచి తప్పించేందుకు జీవిత బీమా ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతుకు సెంటు భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు బీమా వర్తింపజేసేలా ఈ పథకం రూపోందించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని, రైతు మృతి చెందితే రైతు బీమాతో వారి కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకొని రైతుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాలకు రైతు బీమా అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రైతులకు ఆర్థిక చేయూత అందిస్తూ వారికి భరోసా కల్పించారు. 2020-21 సంతవత్సరానికి గాను మండలంలో మొత్తం 38కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నామీని బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగింది. ఈ ఏడాది బుధవారం వరకు ధారూరు మండలంలో మొత్తం 115మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 30 చివరి రోజుగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులు రైతు బీమా ను చేసుకోని వారు ఆగస్టు 30వ తేదిలోపు సంబందిత ఎఈవోలకు రైతు బీమా దరఖాస్తులను అందించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.