ముందు ఈ వీడియో చూడండి ఎంత దారుణం ..
ఈ వీడియో చూస్తే ఓ పాట గుర్తొస్తుంది కదూ… రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతుకగలవమ్మా.. ఎగిరిపోవె యాడికైన కోయిలమ్మా…దారుణం కదూ… కళ్లెంబట నీళ్లొస్తున్నయి. ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇరవైరోజులే అయింది. అప్పుడే షురూ జేసిండ్రు పేదల బతుకుల కూల్చివేతలు. ఈ వీడియో సూడుండ్రి ఎట్ల కూల్చేస్తున్నరో పాపం.. నాకు నలుగురు ఆడపిల్లు సారూ మీ కాల్మొక్త వద్దు సారూ.. అని కాళ్లా వేళ్లా పడ్డా ఆ పేద తల్లి విన్నపాన్నిమన్నించలేదు రెవెన్యూ అధికారులు.
‘కూలీనాలి చేసుకుని బతికేటోళ్లము సారూ.. అంటూ ఎలా బతిమాలుకుంటుందో నిరుపేద తల్లి (వీడియో). ఎదిగిన ఆడపిల్లలు.. ఇప్పుడు ఎక్కడ పండుకుంటరు.. ఏడ స్నానం చేస్తరు… అయ్యో… భగవంతుడా అంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నది.. ఏదో పేద బతుకులు… కాస్తంత నీడ కోసం చిన్నగూడు.. రేకుల షెడ్డు ఏసుకున్నరు. ఇదే కొంత మందకి గిట్టలేదు. పోలీసు బలగంతోనే వచ్చి పేదోడి గుండె మీద తంతున్నరు. మేము రేవంత్ రెడ్డికే ఓటేసినమ్.. మమ్మల్నే ఇట్ల ఆగం చేస్తరా ఈళ్ల కాళ్లు చేతులు పడిపోను.. ఈళ్ల పినుగులెల్ల అంటూ పేద తల్లి షాపనార్థాలు పెట్టడం తప్ప చేసేదేమీ లేకపోయింది.
కేసీఆర్ సర్కారుండగా ఎవరూ ఏమనలే…ఈ ఇంటికి పట్టాలు కూడా ఇస్తమన్నరు. ఇంటికి నెంబరొచ్చింది.. కరెంటు బిల్లు కడుతున్నము. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో దక్కినయి. మరి ఈనికేం రోగమొచ్చింది. మా బతుకులను కూల్చేస్తున్నడు అంటూ సీఎం రేవంత్పై శాపనార్తాలు పెడుతున్నది. పేదలను అడ్డం పెట్టుకుని మాయ మాటలు చెప్పి ఓట్లేయించుకుని బయటపడితివి. బంగారం లాంటి తెలంగాణలో మొదలు పెడితివి పేదల బతుకుల కూల్చివేతలు అంటూ.. రేవంత్రెడ్డీ ఇది న్యాయమేనా?.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల బతుకులు తెల్లబడతయంటివి. ప్రజాపాలన తెస్తమంటివి.. ఇదేనా ప్రజా పాలన? అంటూ ఆవేదనతో నిలదీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.