నిజామాబాద్: ఎమ్మెల్సీ కవితకు అభిమానులు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. నిజామాబాద్లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో 18 వేల నాణేలతో 12 అడుగుల చిత్రం రూపొందించారు. ఆ చిత్రంపై హ్యాపీ బర్త్డే కవితక్క అని రాశారు. నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బసాయి ఈ చిత్రాన్ని ఏర్పాటుచేశారు.
హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత రంగోలీ చిత్రకారుడు విజయ్ భాస్కర్ నేతృత్వంలో కళాకారులు 15 గంటలపాటు శ్రమించి.. ఎమ్మెల్సీ కవిత చిత్రాన్ని రూపొందించారు. వినూత్నంగా ఉన్న కవిత చిత్రపటం వద్ద ఫొటోలు దిగేందుకు సందర్శకులు పోటీపడ్డారు. కాగా, ప్రతి ఏడాది ఏదోఒక ప్రత్యేకత ఉండేలా కవితక్క పుట్టినరోజును నిర్వహిస్తున్నాని సాయి ప్రసాద్ చెప్పారు.