పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రూ. 9.80 కోట్లతో 156 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. సకల హంగులతో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూం కాలనీలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, తదితర సౌకర్యాలు కల్పించారు. వీటిని మంత్రి కేటీఆర్ సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు భోజన ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్ స్వయంగా లబ్ధిదారులకు భక్ష్యాలు వడ్డిస్తూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు.