చాలామంది వాళ్లకోసమే వాళ్లే బతుకతరు. ఎంతసేపు తాము మంచిగుంటే చాలు.. అని అనుకుంటరు. కానీ, కొందరుంటరు.. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ కామారపు రవీందర్. రోజూ ఎక్సర్సైజ్ చేస్తే దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ సాహసమే చేశాడు. ఐస్ గడ్డలేసిన నీళ్లలో అరగంట సేపు ఉండి ఆశ్చర్యపరిచాడు.