డెహ్రాడూన్: శీతాకాలం కావడంతో దేశమంతా చలి పెరిగిపోయింది. ఉత్తరాదిలోని హిమాలయాల సమీప రాష్ట్రాల్లో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోయాయి. పైగా ఆయా రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తున్నది. ఇవాళ ఉత్తరాఖండ్లోని చార్ధామ్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయం మంచు వర్షంలో ( Badrinath snow fall ) తడిసి ముద్దయ్యింది. బద్రినాథ్ ఆలయంపైన, దాని పరిసరాల్లో విపరీతంగా మంచుకురిసింది.
దాంతో ఆలయ పరిసరాలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తెల్లని వస్త్రం పరిచినట్లుగా మారిపోయాయి. ఈ దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. శీతాకాలం కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో ఈ సుందర దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం భక్తులకు దక్కలేదు. కనులకు ఇంపైన ఈ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా ఒకసారి వీక్షించండి.