Viral Video | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేయకపోయినా.. సమకాలీన అంశాల మీద మాత్రం ఆయన పోస్టులు పెడుతుంటారు. వాటికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తుంటుంది. ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.
సాధారణంగా ఓ వెయిటర్ ఒకేసారి ఆహార పదార్థాలు ఉన్న ప్లేట్లను ఎన్ని తీసుకెళ్లగలడు. రెండు.. మహా అయితే మూడు. అంతకు మించి తీసుకెళ్లలేరు. అయితే ఓ వెయిటర్ మాత్రం 16 దోశ ప్లేట్లను ఒకేసారి ఒకే చేతిపై తీసుకెళ్లాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! తీసుకెళ్లడమే కాదండోయ్. ప్రతి దోశ ప్లేట్ కస్టమర్ల టేబుల్ వద్దకెళ్లి స్వయంగా సర్వ్ చేశాడు కూడా. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..‘మనం ‘వెయిటర్ ప్రొడక్టివిటీ’ని ఒలింపిక్ క్రీడగా గుర్తించాలి..’ అంటూ సరదాగా క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వెయిటర్ ప్రతిభను మీరూ చూసేయండి.
We need to get ‘Waiter Productivity’ recognised as an Olympic sport. This gentleman would be a contender for Gold in that event… pic.twitter.com/2vVw7HCe8A
— anand mahindra (@anandmahindra) January 31, 2023