Viral Video | యూకేలో కొనసాగుతున్న వీసా సమస్యల నేపథ్యంలో ప్రముఖ చెఫ్ సంజయ్ రైనా షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యూకే కొత్త ప్రధాని రిషి సునాక్.. భారత్లో ఉన్న ఓ వ్యక్తిని యూకేకి ఇన్వైట్ చేస్తూ కనిపిస్తారు.
వీడియోలో ముందుగా సంజయ్.. ‘మామా, మీకు ఒకరు హాయ్ చెప్తారు’ అని అంటాడు. ఆ వెంటనే కెమెరా రిషి సునాక్ వైపు మళ్లుతుంది. రిషి వీడియో కాల్లో ఇలా మాట్లాడతాడు. ‘హాయ్ విజయ్ మామా, నేను రిషి. మీరు ఎలా ఉన్నారు..? మీరు యూకే వచ్చినప్పుడు నన్ను కలుస్తారని అనుకుంటున్నా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డైనింగ్ స్ట్రీట్కి తీసుకురామని మీ మేనల్లుడిని అడగండి.. జాగ్రత్త’’ అని చెప్తాడు. వీడియో షేర్ చేసిన సంజయ్ ‘వీసా ఆన్ అరైవల్ పక్కా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ మామా’ ఎవరు..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్లో జాప్యం నెలకొన్న విషయం తెలిసిందే. వీసా పరిమితి దాటిన తర్వాత బ్రిటన్లో నివసించే వారిలో అత్యధికులు భారతీయులే అని ఆ దేశ హోంమంత్రి, భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. భారత్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో వీసాల అంశంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వివిధ కారణాల వల్ల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్లో నెలకొన్న జాప్యాన్ని తొలగించేందుకు యూకే వేగంగా చర్యలు చేపట్టినట్లు ఇటీవల భారత్లోని బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ తెలిపారు. తమ ప్రమాణాల ప్రకారం 15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
Visa on arrival ab pakka 😊😊#RishiSunak pic.twitter.com/imSIhuEgKB
— Sanjay Raina (@sanjayraina) October 27, 2022