రైళ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికి పక్కన కూర్చుండి ప్రకృతిని చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కిటికి పక్కన కూర్చుని ప్రయాణించడంలో ఎన్నో అనుభూతులను మూటగట్టుకోవచ్చు. ఘాట్ల వెంట.. జలపాతాల ముందు నుంచి రైలు వెళ్తేందే అనుకో.. ఆ ఆనందం వర్ణించనలవికాదు. అలాంటి ఓ అందమైన అనుభూతిని దారా ఘాట్ ప్రయాణంలో అందిపుచ్చుకోవచ్చునంటున్నది భారతీయ రైల్వే శాఖ.
భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతి పెద్ద రైలు నెట్వర్క్ కలిగిన సంస్థగా పేరుగాంచింది. మన రైళ్లు ఎన్నో తరచుగా ఉత్కంఠభరితమైన దృశ్యాలను దాటుకుంటూ ప్రయాణిస్తుంటాయి. అలాంటి ఓ సుందర దృశ్యాన్ని రైల్వే శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రాజస్థాన్లోని దారా ఘాట్.. మైదాన పర్వాతాలపై పరుచుకున్న ల్యాండ్స్కేప్ మధ్య ‘కూ..’ అంటూ దూసుకుపోతున్న దృశ్యం నెటిజెన్లను ఇట్టే కట్టిపడేస్తున్నది.
‘సమృద్ధిగా ప్రసాదించిన ప్రకృతి’ కాప్షన్తో రైల్వే శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 14 వేల మంది నెటిజెన్ల మనసు దోచుకున్నది. వందల సంఖ్యలో లైక్లు అందుతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలని కోరుకునే ఇలాంటి ట్రాక్ను సిద్ధం చేసిన రైల్వే శాఖకు అభినందనలు అంటూ ఓ నెటిజెన్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
Bestowed with abundance of nature!
Panoramic view of an Express Train traversing through the lush landscape of Dara Ghats in Kota-Nagda Section of @wc_railway. pic.twitter.com/2gRPYvldvA
— Ministry of Railways (@RailMinIndia) July 28, 2022