చైనాను కరోనా మళ్లీ వణికిస్తోంది. షాంఘై నగరంలో కఠిన లాక్డౌన్ విధించారు. పోలీసులు రోబో డాగ్స్తో పహారా కాస్తున్నారు. ప్రజలందరూ ఇళ్లలోని బాల్కనీలకే పరిమితమైపోయారు. ఏంచేయాలో తోచక గిలగిలా కొట్టుకుంటున్నారు. కాగా, ఓ వ్యక్తి డ్రోన్ ఉపయోగించి ఆ అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న కుండీలోని చేపలు దొంగతనం చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఆకలితో ఉన్న ఓ వ్యక్తి తన డ్రోన్కు గాలాన్ని తగిలించాడు. దాన్ని తన అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న కుండీలోకి వదిలాడు. గాలానికి ఓ చేపచిక్కగా పైకిలాగాడు. చేప గిలగిలా కొట్టుకుంటూ పైకి వచ్చింది. ఈ వీడియోను న్యూయార్క్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ రోడ్రిగో జీడాన్ తన ట్విటర్లో అకౌంట్లో షేర్చేశారు. ‘షాంఘైల్ గ్రోసరీ షాపింగ్, 2022 ఎడిషన్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5లక్షల మంది చూశారు. నెట్టిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Grocery shopping in Shanghai, 2022 edition. pic.twitter.com/Azz3f6KKee
— Rodrigo Zeidan (@RodZeidan) April 16, 2022