Ladakh | క్రికెట్ గురించి తెలియని వారు ఉండరు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ ఆటను ఆదరిస్తుంటారు. ముఖ్యంగా మనదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా భావిస్తుంటారు. వారిలా ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునేవారు బోలెడుమంది. అయితే, అందులో కొందరు మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలరు. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు చెందిన ఓ విద్యార్థిని కూడా ఇలాగే ఆశపడుతోంది. విరాట్ కోహ్లీ స్థాయికి ఎదగాలనుకుంటోంది.
లద్దాఖ్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ విద్యార్థికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. అందులో ఆరో తరగతి చదువుతున్న మఖ్సూమా.. బ్యాట్తో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. బాల్ను బౌండరీలు దాటించేలా బ్యాటింగ్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నేను క్రికెట్ ఆడేందుకు ఇంట్లో మా నాన్న, స్కూల్లో మా టీచర్ఎంతో సహకారం అందిస్తున్నారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు నా వంతు ప్రయత్నిస్తున్నాను’’ అంటూ మఖ్సూమా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
My father at home and my teacher at school encourage me to play cricket. I’ll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt
— DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022