ఉపయోగంలో లేని రైలు బోగీలను రెస్టారెంట్లుగా మారుస్తూ భారతీయ రైల్వేస్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పనికిరాని ఒక రైలుబోగీని రెస్టారెంటుగా మార్చారు. ఇది దాదాపు పూర్తయిపోయింది.
ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. ఈ రెస్టారెంటు ఓపెన్ అయిన తర్వాత ఏటా సుమారు రూ.13 లక్షల ఆదాయం వస్తుందని, ఇదంతా నాన్-ఫేర్ ఆదాయమని పశ్చిమ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.
భారతీయ రైల్వేలు ఉపయోగంలో లేని రైలు బోగీలను కాన్సెప్ట్ రెస్టారెంట్లుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. పశ్చిమ మధ్య రైల్వే షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.