Ziva : ఫిఫా వరల్డ్ కప్ సాధించిన ఆనందాన్ని అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ అందరితో పంచుకుంటున్నాడు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు సంతకం చేసిన జెర్సీలను కానుకగా ఇస్తున్నాడు. తాజాగా అతను భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ కూతురు జీవాకు తన జెర్సీ పంపించాడు. దానిమీద ఫర్ జీవా అని రాసింది. అంతేకాదు తండ్రి లాంటి కూతురు, కామన్ లవ్, మెర్రీ క్రిస్మస్ అని రాసి ఉంది. ఈ ఫొటోలను జీవా సింగ్ ధోనీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. మెస్సీ జెర్సీ వేసుకుని మురిసిపోతున్న జీవా ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. మెస్సీకి ఎంఎస్. ధోనీ పెద్ద అభిమాని. ఈ విషయం తెలిసిన అర్జెంటీనా స్టార్ తన జెర్సీ పంపించి ధోనీని సర్ప్రైజ్ చేశాడు. రెండు రోజుల క్రితం మెస్సీ తన సంతకం ఉన్న జెర్సీని బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించిన సంగతి తెలిసిందే.
ఉత్కంఠభరితంగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్పై గెలుపొందింది. దాంతో, అర్జెంటీనా 32 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ ఛాంపియన్దగా అవతరించింది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ కల కూడా నెరవేరింది.