అందరిలాగే బాలీవుడ్ సెలబ్రెటీలు హోలీ పండుగను తమ ఇష్టమైన వాళ్లతో కలిసి ఎంజాయ్ చేశారు. చాలామంది తారలు నగరంలో గులాల్ రంగులు పూసుకుని కనిపించారు. కానీ, కరీనాకపూర్ మాత్రం నగరానికి దూరంగా వెళ్లిపోయారు. తన గ్యాంగ్ కరిష్మాకపూర్, నటాషా పూనావాలాతో కలిసి బీచ్లో హోలీ సంబురాలు జరుపుకున్నారు.
కరీనాకపూర్.. తన చిన్నకొడుకు జహంగీర్ అలీఖాన్తోతో కలిసి బీచ్లో పిచ్చుకగూడు కడుతున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. కొద్దిసేపట్లోనే ఈ ఫొటో వైరల్ అయ్యింది. స్విమ్ షూట్లో ఉన్న కరీనాకపూర్.. పిచ్చుక గూడు కట్టేందుకు కొడుకుకు సహాయం చేస్తూ ఈ ఫొటోలో కనిపించింది. కాగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలాతో పాటు తన అక్క కరీష్మాకపూర్తో బీచ్లో ఎంజాయ్ చేసిన ఫొటోలను కరీనాకపూర్ సోషల్మీడియాలో ఉంచారు. బీచ్లో తమకు ఇష్టమైన ఫుడ్తింటూ ఇష్టమైనవారితో ఎంజాయ్ చేస్తున్నా అని క్యాప్షన్ ఇచ్చారు.