న్యూడిల్లీ : కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పడది ఏకంగా 1.1 కోట్ల వ్యూస్ రాబట్టింది.
అమీర్ ఖాన్ అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్లో ఓ వ్యక్తి నంగ్లోయి మెట్రో స్టేషన్ ట్రాక్స్పై నడుచుకుంటూ వెళుతుండటం కనిపింది. కింద వందలాది జనం కేకలు వేస్తూ బిగ్గరగా విజిల్స్ వేసినా సదరు వ్యక్తి ఏ మాత్రం పట్టించుకోకుండా ట్రాక్స్పై తన దారిన తాను వెళుతుండటం కనిపించింది.
ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించగా పెద్దసంఖ్యలో కామెంట్లు వచ్చిపడ్డాయి. లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ వాక్ చేస్తున్నాడని కొందరు యూజర్లు కామెంట్ చేశారు.