డ్రగ్స్కు బానిసైనవారు ఎప్పుడేం చేస్తారో..? ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో? తెలియదు. కానీ, యూపీ రాజధాని లక్నోలో మాత్రం వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాళ్లు దొంగతనం చేస్తున్నది ఆభరణాలో.. పైసలో కాదు.. చీప్గా బాత్రూంలోని నల్లాలు..మురుగు కాలువ చాంబర్లు. అవి తప్ప ఇంట్లోని ఏ వస్తువునూ ముట్టడం లేదు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. డ్రగ్స్ బానిసలు ఈ చీప్ దొంగతనం ఎందుకు చేస్తున్నారో మాత్రం అంతుచిక్కకపోవడం గమనార్హం.
లక్నోలోని ఇందిరానగర్లోగల అరడజను ఇళ్లల్లో డ్రగ్స్ మత్తుల్లో ఉన్న యువత దొంగతనాలు చేశారు. గోడదూకి నేరుగా ఇళ్లల్లోకి ప్రవేశించిన దొంగలు మొదట బాత్రూమ్లోకి వెళ్లారు. అందులోని నళ్లాలను తీసి జేబులో వేసుకున్నారు. అనంతరం మురుగు నీటి చాంబర్లను పైకిలేపి వెంట తీసుకెళ్లారు. ఈ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. చాంబర్లను స్క్రాప్ డీలర్లకు అమ్మి, సొమ్ము చేసుకోవచ్చని, కానీ, నళ్లాలను ఏంచేస్తున్నారో తెలియడం లేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంఫాల్ ప్రజాపతి పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.