చెక్రిపబ్లిక్లోని ఓ జంతుప్రదర్శనశాలలో అత్యంత అంతరించిపోయే దశలోఉన్న ఈస్ట్రన్ బ్లాక్ ఖడ్గమృగం జన్మించింది. దానికి జూ అధికారులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేరు పెట్టారు. రష్యాపై వీరోచితంగా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్కు గౌరవసూచకంగా ఈ పేరు పెట్టారు.ఈ వార్త ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఖడ్గమృగం చెక్ రిపబ్లిక్లోని ద్వూర్ క్రాలోవ్ జంతు ప్రదర్శనశాలలో మార్చి 4న జన్మించింది. ఇది ఈస్ట్రన్ బ్లాక్ జాతికి చెందినది. ఇది అరుదైన జాతి. అందుకే దీనికి కీవ్ అనే పేరుపెట్టామని జూ డైరెక్టర్ ప్రేమిస్ల్ రబాస్ చెప్పారు. ఇది ఉక్రెయిన్ పోరాటయోధులకు తామిచ్చే మద్దతు అని ఆయన చెప్పారు.