ఫస్ట్ వేవ్ అయిపోయింది. సెకండ్ వేవ్ అయిపోయింది. ఆ మధ్యే థర్డ్ వేవ్ కూడా వస్తోందంటూ అందరూ భయపడ్డారు. కానీ.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ను చూస్తే ఇప్పుడే థర్డ్ వేర్ స్టార్ట్ అయిందేమో అన్నట్టుగా కనిపిస్తోంది. ప్రపంచమంతా మరోసారి భయం గుప్పిట్లో బతుకుతోంది. ఈనేపథ్యంలో ఓ దేశంలో తొలిసారి కరోనా కేసు నమోదు అయింది.
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ.. డిసెంబర్ 4న అంటే ఈరోజు ఒక కోవిడ్ 19 కేసు నమోదు అయింది.
10 ఏళ్ల బాలుడిలో కరోనా వైరస్ వ్యాప్తి కాగా.. ఆ దేశంలో అదే తొలి కరోనా కేసు అయింది. వేరే దేశం నుంచి స్వదేశానికి తన ఫ్యామిలీతో వచ్చిన తర్వాత టెస్ట్ చేయగా ఆ బాలుడికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇంతకీ తొలి కేసు నమోదు చేసుకున్న ఆ దేశం పేరేంటి అంటారా? కుక్ ఐలాండ్స్(Cook Islands). సౌత్ పసిఫిక్ దేశం అది. అక్కడి జనాభా 17 వేలు మాత్రమే. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యాక్సినేషన్ రేట్స్ ఉన్న దేశాల్లో ఈ ఐలాండ్ కూడా ఉంది. దాదాపు అందరూ అక్కడ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. 96 శాతం జనాభా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
అయితే.. న్యూజిలాండ్ నుంచి ఫ్యామిలీతో ఐలాండ్కు తిరిగి వచ్చిన ఆ బాలుడిలో కరోనా బయటపడటంతో వెంటనే అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే అంతర్జాతీయ బార్డర్లను ఐలాండ్ మూసేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Hyderabad | లాక్డౌన్ టైమ్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు.. నోబెల్కు నామినేట్ అయ్యారు