ఒక పిల్లి చేసిన పని వల్ల 60 వేల మందికిపైగా ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి కరెంటు సరఫరా చేసే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఎక్కవిప్మెంట్లోకి పిల్లి ఎక్కేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఈ సమస్య వల్ల కొన్ని గంటల పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భోసారి, ఆకుర్డి, పింప్రి చించ్వాడ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటలకు కరెంటు పోయి, మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ వచ్చింది.
‘‘భోసారిలోని ట్రాన్స్ఫార్మర్కు చెందిన 22 కేవీ యార్డ్లోకి ఒక పిల్లి ప్రవేశించింది. ఈ కారణంగ భోసారి, ఆకుర్డి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది’’ అని ఎంఎస్ఈడీసీఎల్ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణమైన పిల్లి మరణించినట్లు వెల్లడించారు.