నిజమే.. పెళ్లి అనేది జీవితాంతం గుర్తుంచుకునే ఒక మధురానుభూతి. కానీ.. పెళ్లి చేసుకోవాల్సిన మండపంలో పెళ్లే చేసుకోవాలి కానీ.. వింత పనులు చేస్తే ఎలా ఉంటది. వాళ్ల పెళ్లి కన్నా.. వాళ్లు చేసిన పని హాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా అదే జరిగింది. పెళ్లి కోసం మంచిగా ముస్తాబు అయిన నవ వధూవరులు.. పెళ్లి మండపం ఎక్కి పుష్అప్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో పెళ్లికొచ్చిన అతిథులు షాక్ అయ్యారు.
అసలు విషయం ఏంటంటే.. పెళ్లి కొడుకు ఆదిత్య మహజన్, పెళ్లి కూతురు అక్షిత అరోరా మహజన్.. ఇద్దరూ ఫిట్నెస్ కోచ్లు. అందుకే.. వృత్తిని ఒకసారి పెళ్లిమండపం మీద గుర్తుకు తెచ్చుకొని.. ఇలా ఇద్దరూ పుష్అప్స్ తీశారు. పెళ్లి కూతురు అయితే 8 కిలోల బరువు ఉన్న లెహంగాను వేసుకొని మరీ.. పుష్అప్స్ చేసింది. బ్యాక్గ్రౌండ్లో వైరల్ బచ్పన్ కా ప్యార్ అనే సాంగ్ మ్యూజిక్ యాడ్ చేసి ఆ వీడియోను పెళ్లికూతురు అక్షిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు మాత్రం వాళ్లకు ఫిట్నెస్పై ఉన్న ఆసక్తిని చూసి ఫిదా అవుతున్నారు. అంత భారీ లెహంగా వేసుకొని.. పెళ్లి కూతురు పుష్అప్స్ చేయడం మామూలు విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Viral Photo : కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. ఫోటో వైరల్
Viral Video : జోరుగా.. హుషారుగా బామ్మ డ్యాన్స్.. కోయి లడ్కీ హై.. అంటూ అదరగొట్టింది
Viral Video : ఇదేందయ్యా ఇది.. ఫోన్ను ఎత్తుకెళ్లిన పక్షి ఏం చేసిందో చూడండి