అంబులెన్స్ అంటే ఆపద సమయాల్లో మనల్ని దవాఖానకు చేర్చేది. అందుకే అంబులెన్స్ కనిపిస్తే అందరం దారిస్తాం. అంబులెన్స్కు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు. సంబంధిత అధికారులతోపాటు అంబులెన్స్ డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంధనం లేక ఓ అంబులెన్స్ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిపోయింది. అందులో పేషెంట్ కూడా ఉన్నారు. ఈ వార్త నెట్టింట వైరల్కాగా, ప్రజలు మండిపడుతున్నారు.
వివరాల్లోకెళితే, ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ నుంచి మీరుట్ దవాఖానకు పేషెంట్తో ఓ అంబులెన్స్ బయలుదేరింది. అయితే, మార్గమధ్యలో ఇంధనం అయిపోవడంతో అర్ధరాత్రిపూట నడిరోడ్డుపై నిలిచిపోయింది. ఇది గమనించిన ఓ వ్యక్తి తన ట్రాక్టర్కు అంబులెన్స్ను తాడుతో కట్టి సమీప పెట్రోల్ బంక్వరకు లాక్కెళ్లాడు. ఈ చిత్రాలు సోషల్మీడియాలో వైరల్గా మారడంతో మీరుట్ జిల్లాలో కలకలం రేపాయి. మీరుట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేశ్ వివరణ ఇచ్చారు. ఆ అంబులెన్స్ మీరుట్ది కాదని, బిజ్నోర్ నుంచి వచ్చిందని చెప్పారు. ఇంధనం అయిపోవడం వల్లే మధ్యలో ఆగిపోయిందన్నారు.