వాషింగ్టన్: తాలిబన్లు కాబూల్ను ఆక్రమించిన తర్వాత లక్ష మందికిపైగా ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లారని అమెరికా ప్రకటించింది. ఆగస్టు 14 తర్వాత సుమారు లక్షా 100 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని వైట్హౌస్ వర్గాలు వెల్లడించారు. గత 12 గంటల్లో 39 విమానాల్లో సుమారు 7500 మంది కాబూల్ నుంచి తరలించామని పేర్కొన్నారు. కాబూల్ ఎయిర్పోర్టు వద్ద బాంబు దాడి అనంతరం వైట్హౌస్ ఈమేరకు ప్రకటన వెలువరించింది. ఆ దాడుల్లో 72 మంది మరణించగా, అందులో అమెరికా రక్షణ సిబ్బంది 13 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మరో 143 మంది గాయపడ్డారని చెప్పారు.
కాగా, 2001 నుంచి ఇప్పటివరకు ఆఫ్ఘనిస్థాన్లో 2300 మందికిపైగా అమెరికన్లు కన్నుమూశారని, 20 వేల మందికిపైగా గాయపడ్డారని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జే బ్లింకెన్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులతో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో 8 లక్షల మందికిపైగా సైనికులు, ఇతర అమెరికన్లు పాల్గొన్నారని తెలిపారు.