ekta kapoor | బాలీవుడ్లో విజయవంతమైన మహిళా నిర్మాతగా పేరు సంపాదించారు ఏక్తా కపూర్. టెలివిజన్ రంగంలోనూ ‘బాలాజీ టెలీఫిల్మ్స్’ ద్వారా ఎన్నో ధారావాహికలు, సెలబ్రిటీ షోలు అందిస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. ఈ ఎంటర్టెయిన్మెంట్ ఆంత్రప్రెన్యూర్ మరో కొత్త అడుగు వేశారు. గ్రామీణ కళలను ప్రోత్సహిస్తూ ‘ఏక్: బ్రింగ్ ఇండియా హోమ్’ ( Ek: Bring India Home ) అనే హోమ్డెకర్ బ్రాండ్కు నాంది పలికారు.
గ్రామీణ కళాకారులు తయారు చేసిన గృహాలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, ఆధ్యాత్మిక ఉపకరణాలు మొదలైన వాటిని ఆన్లైన్లో విక్రయించాలన్నది ఏక్తాకపూర్ వ్యాపార ప్రణాళిక. ఈ ప్రయత్నంలో గ్లామ్ అండ్ రొపొసొ కంపెనీతో ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల, మార్కెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకోవచ్చు. బుధవారం ఆన్లైన్ వేదికగా గ్లామ్ అండ్ రొపొసొతో ‘ఏక్’ మార్కెట్లోకి వస్తున్న సంగతి ప్రకటించారు ఏక్తా కపూర్. భారతదేశంలో ఉన్నన్ని కళలు మరెక్కడా ఉండవు. ఉపాధి అవకాశాలు తగ్గిపోయిన కళాకారులకు అండగా నిలబడితే, ఇటు కళా సంపదను కాపాడుకోవచ్చు, అటు అనేక జీవితాల్లో వెలుగులూ నింపవచ్చని భావించారు ఏక్తా.
ఉదాహరణకు రాజస్థాన్కే సొంతమైన బగ్రూ డిజైన్ను ఏక్తా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ప్రసిద్ధ కళాకారుడు ఆర్కే డేరావాలాతో కలిసి ఆమె ఈ మంచి పని చేస్తున్నారు. చీరలపై సహజమైన రంగులతో వేసే బగ్రూ డిజైన్ అంతరించిపోకుండా తన వంతు కృషిచేస్తున్నారు డేరావాలా. ‘భారత ప్రభుత్వం నన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం ఓ కలగా అనిపిస్తున్నది. ఈ అవార్డు వచ్చినందుకు నా కంటే మా అమ్మకే ఎక్కువ ఆనందంగా ఉంది. వ్యాపారం అనేది ఓ సామాజిక బాధ్యత . కళలను బతికించే లక్ష్యంతో మేం మార్కెట్ చేస్తున్న ఉత్పత్తులను మా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయండి. కళాకారులకు భరోసా ఇవ్వండి’ అని పిలుపునిచ్చారు ఏక్తా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
pneumonia | పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
హైదరాబాదీలు ఇష్టంగా లాగించేస్తున్న ఈ కొత్తరకం స్వీట్ గురించి తెలుసా?
హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ!