హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలు స్వాగతిస్తున్నాయి. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకున్నందుకు గౌడ కులస్థులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘కల్లుగీత వృత్తి చేసే గౌడకులంలో పుట్టిన బిడ్డవు. నేనే నీకు సన్మానం చేయాలె’ అని సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో తనతో పేర్కొనటం ఆయన నిరాడంబరతకు నిదర్శమని శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దేశంలో కుల వృత్తులను ప్రోత్సహించడం సీఎం కేసీఆర్కే సాధ్యమని చెప్పారు. ఇప్పటికే నీరా అమ్మకాలను కేవలం గౌడ కులస్థులకే కేటాయించేలా నిర్ణయించారని గుర్తుచేశారు. సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
దళితుల ఆర్థిక ఎదుగుదలకు ఊతం
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు బార్లు, మద్యం షాపుల్లో దళితులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. ఇది దళితుల ఆర్థిక ఎదుగుదలకు ఊతంగా నిలుస్తుంది. దళితబంధు అమలుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్న సీఎం కేసీఆర్.. తాజా నిర్ణయంతో ఆ కీర్తిని మరింత పెంచారు.
సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించారు. ఇప్పుడు మద్యం దుకాణాల్లో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించటం గొప్ప నిర్ణయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి.
గౌడకులస్థులపై సీఎం కేసీఆర్ ప్రేమ
గౌడ సామాజికవర్గానికి వైన్స్ లైసెన్సుల్లో రిజర్వేషన్ కల్పించడంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వీ శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు. ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్ గౌడ కులస్థులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.
సాహసోపేత నిర్ణయం
వ్యాపారాల్లోనూ రిజర్వేషన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ సాహసోపేత నిర్ణయం గౌడకులస్థులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఈ విధానం దశలవారీగా మిగతా బీసీలకు విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
బీసీల అభ్యున్నతికి దోహదం
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం బీసీ కులాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా మద్యం దుకాణాల్లోనూ రిజర్వేషన్లు అమలుచేస్తామని నిర్ణయం తీసుకోవటం శుభపరిణామం. ఈ రిజర్వేషన్తో గౌడ కులస్థుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి.