పెద్దపల్లి : మహాత్మ జ్యోతిరావు పూలే (Mahatma Jyotiba Phule)వర్ధంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా మంథనిలో (Manthani) ఘనంగా నిర్వహించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్(ZP Chairman Putta Madhukar) పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భీమ్ దీక్ష(Bhim Deeksha )తీసుకున్నారు. ఈ సందర్భంగామధుకర్ మాట్లాడుతూ..పూలే ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.
మహనీయుల ఆశయ సాధనలో భాగంగా భీమ్ దీక్షను తీసుకున్నట్లు తెలిపారు. దేశానికి పూలే, అంబేద్కర్ చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా సబ్బండ వర్ణాలకు సంక్షేమానికి పాటుబడిన గొప్ప వ్యక్తులు అని కొనియాడారు. నిరుపేదలు, స్త్రీ విద్య కోసం మహాత్మ పూలే ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.