హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను డ్రగ్స్హ్రితంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థుల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఈగల్ అధికారులతో డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్రమశిక్షణను తీర్చిదిద్దే విద్యాసంస్థల్లో డ్రగ్స్కు ఏమాత్రం చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.
అన్ని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే రోడ్డు భద్రతపై ఈ నూతన సంస్థ ఏర్పాటు గురించి పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి ప్రత్యేక ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ ఏర్పాటు దిశగా తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు ప్రారంభించినట్టు డీజీపీ చెప్పారు.