BRS | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ నరోత్తంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి నరోత్తం రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేశారు.
రాష్ట్రంలో ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని, ఈ నేపథ్యంలోనే తాను జహీరాబాద్ నియోజకవర్గ మేలుకోసం బీఆర్ఎస్లో చేరానని నరోత్తమ్ చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు కోరుకొంటున్న క్రమంలోనే తాను పార్టీలో చేరానని, బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ కోసం, జహీరాబాద్ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు.