హైదరాబాద్, ఆగస్టు9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని బీసీ జాబితాలో ఉన్న 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఆ 40 కులాలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేని కారణంగా ఆయా కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పొందలేకపోతున్నారని వివరించారు. దీనికోసం ఆయా కులాలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని కోరారు.