హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తాను, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సహచర ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఒక న్యూస్ చానల్ ప్రసారం చేస్తున్న కథనాల్లో వాస్తవం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు స్పష్టంచేశారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు నమ్మొద్దని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
తాము మంగళవారం ఏ హోటల్లోనూ సమావేశం నిర్వహించలేదని, క్యాంప్ ఆఫీసులో మాత్రమే ఉన్నామని చెప్పారు. మీడియాలో వందసార్లు రాసినా తాను పార్టీ వీడే ప్రసక్తేలేదని, కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతానని తెలిపారు. పార్టీ గేట్లు కాదు, మొదట హామీల గేట్లు తెరవాలని కాంగ్రెస్ పార్టీకి చురకలేశారు.