Zaheerabad | సంగారెడ్డి : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజు శ్రీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు.