హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాలను కలుపుకొని సంయుక్త కార్యాచరణకు దిగాలని ప్రయత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా ఏకాకి అయ్యారు. నిరుద్యోగ సమస్యపై సంయుక్తంగా ప్రగతిభవన్ మార్చ్కు పిలుపునివ్వాలని భావించిన షర్మిల ఈ క్రమంలో విపక్ష నేతలను సంప్రదించారు.
బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఫోన్ చేసి తన ప్రతిపాదనను తెలిపారు. కాంగ్రెస్తో వేదిక పంచుకోలేమని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ సమావేశంలో చర్చించాక రాలేమన్న నిర్ణయాన్ని రేవంత్రెడ్డి చెప్పారు. వామపక్షాలే బీఆర్ఎస్కు బీ టీమ్లా మారాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు.