మహబూబాబాద్: వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మహబూబాబాద్లో బ్రేక్పడింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేతోలులో షర్మిలను అదుపులోకి తీసున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే శంకర్నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ నేత లూనావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. షర్మిల పాదయాత్ర అనుమతిని రద్దుచేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండటంతో షర్మిలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
గతంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై కూడా షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఆమె యాత్రను పార్టీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పాదయాత్రకు అనుమతి రద్దుచేసిన పోలీసులు.. షర్మిను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.