కరీంనగర్ : హుజురాబాద్లో ఎలాగైనా గెలువాలని ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్కు అడుగడుగునా నిరసనల సెగ తగులుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఈటల ప్రలోభాలపై స్థానికులు మండిపడ్డారు. 60 రూపాయల గడియారం ఇచ్చి ఆశ చూపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 15వ వార్డులోని కేశవపూర్లో దొంగ చాటుగా ఇంటింటికి గోడ గడియారాలను పంపిణీ చేస్తుండటంతో ఆ వార్డు యువత అడ్డుకుంది.
వారికి పంపిణీ చేసిన గోడ గడియారాలను నడి బజారులో పగలగొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అలాగే వీణవంక మండలం ఎల్వక, చల్లూర్, కోర్కాల్ గ్రామాలలో దళిత కాలనీలో సైతం ఈటల ఫొటోతో ఉన్న గోడ గడియారాలు రోడ్డుపై పగలగొట్టారు.
ఇలాంటి తాయిలాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్ని తాయిలాలు ఇచ్చినా ప్రజలంతా టీఆర్ఎస్కే ఓటు వేస్తారని స్పష్టం చేసారు. తాజాగా హుజురాబాద్లో ఈటల జమున ముందే..గోడ గడియారాలను పగుల గొట్టిన విషయం తెలిసిందే. అయినా కూడా ఈటల తీరు మారడం లేదు.
ప్రజలు ఛీ కొడుతున్నా గోడ గడియారాలను పంచుతూనే ఉన్నాడు. తాను చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతర పార్టీలు తాయిళాలు ఇస్తున్నాయంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానికులు అసహించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో
మెరుపు వేగంతో భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్