ఆంధ్రా యువకుడి పాదయాత్ర
ఖమ్మం, మే 29: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కేటీఆర్ అభిమాని. కేటీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేసుకొని ప్రత్యేక అభిమానాన్ని చాటుతున్నాడు. కేటీఆర్ సీఎం కావాలని కోరుతూ శుక్రవారం విజయవాడ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆయన ఆదివారం ఖమ్మం చేరుకొన్నాడు. ఇక్కడి నుంచి వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్రను కొనసాగించనున్నాడు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నదని పేర్కొంటున్నాడు. వారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై అభిమానిగా మారిపోయానని శేఖర్ చెప్తున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి ఇతర రాష్ర్టాలు తెలుసుకోవాలని, కేటీఆర్ సీఎం కావాలనే సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నానని శేఖర్ పేర్కొన్నాడు. హైదరా బాద్లో మంత్రి కేటీఆర్ను కలువనున్నటు చెప్పారు.