ములుగు : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లి గోదావరి నదిలో మునిగిత ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కమలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కమలాపురం గ్రామానికి చెందిన భూక్య రవి, లీల దంపతుల చిన్న కుమారుడు భూక్య సాయి (19) బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు.
కాగా, శివరాత్రి పండుగ సందర్భంగా తల్లి లీలతో కలిసి కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లాడు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఈత రాని సాయి నదిలో కొట్టుకుపోయాడు. మంగపేట తాసిల్దార్ కలీం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.