ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు హోలీ సంబురాలు చేసుకున్న అనంతరం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నదీ ప్రవాహంలో గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.