Karimnagar | ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఇంట్లోకి చొరబడి బ్లేడ్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకున్నది. సాయి అనే యువకుడి ప్రేమను నిరాకరించిందన్న కారణంతో బ్లేడ్ సహాయంతో యువతి గొంతుకోశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం నిందితుడు సాయి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని యువతి నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.