హయత్నగర్ రూరల్, మే 3: విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఎండ్ల యశ్వంత్ (22), మెట్టుగూడకు చెందిన వివాహిత జ్యోతి (28)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. రెండ్రోజుల కిందటే వీరిని చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. యశ్వంత్కు వివాహం కాలేదు.
జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసు విచారణలో తెలిసింది. వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరినీ భర్తనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వీరు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నేరుగా ఈ ప్రదేశానికి చేరుకోగా, వీరిని భర్త వెంబడించి, ఏకాంతంగా సన్నిహితంగా ఉన్న సమయంలో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడని ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. యశ్వంత్ మర్మాంగంపై పొడిచిన గుర్తులు ఉన్నాయి. మూ డు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ వెల్లడించారు. మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. జ్యోతి భర్త శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.