హనుమకొండ :మానసిక ఒత్తిడి, అశాంతిని దూరం చేసేందుకు యోగ(yoga) అత్యుత్త మెడిసిన్గా పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.హనుమకొండ (Hanmakonda) ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో హార్ట్ ఫుల్ నెస్, శ్రీ రామ చంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగ మహోత్సవ్(Yoga mahatsavam) ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో ఒత్తిడి సర్వ సాధారణంగా మారిందని అన్నారు. ఒత్తిడిని జయించడానికి మందులు, మాకుల కంటే యోగా సాధన మంచి మార్గమని పేర్కొన్నారు.యోగా ఫలితాలను అందిస్తూ, ప్రపంచ శాంతి కోసం రామచంద్ర మిషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ ఉత్సవాలకు ప్రపంచంలోనే ప్రముఖ గ్రంథ కర్త, ఆధ్యాత్మిక యోగ గురువు రామచంద్ర మిషన్ కమలేశ్ డి పటేల్.. దాదాజీ రావడం అదృష్టమరి వెల్లడించారు. వారి కోరిక మేరకు పర్వతగిరిలో యోగ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం స్వచ్ఛందంగా ఇచ్చామని వివరించారు.
వరంగల్ జిల్లా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ యోగ ధ్యాన కేంద్రాన్ని నిర్మించబోతున్నామని అన్నారు. దాదాజీ మాట్లాడుతూ జీవన విధానం యోగాలో ప్రాణాయామం చాలా ముఖ్యమైనదని అన్నారు. యోగాలో అష్టాంగ యోగా లో యమ నియమాలు గురించి తెలుసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్, సీపీ, కమిషనర్, ఇతర ప్రజా ప్రతినిధులు బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్, మంత్రి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.