హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించేడం లేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని నిలదీశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
Yet not a word against BJP from Telangana CM !! Deafening silence
What are you scared of? Why this abject surrender on the interests of the state?
From meekly signing & handing over projects to KRMB to staying absolutely silent on injustice meted out to state, truly appalling pic.twitter.com/UOHuLoBSPX
— KTR (@KTRBRS) February 3, 2024
బీజేపీని ఆపగలిగే శక్తి బలమైన ప్రాంతీయ పార్టీలకే ఉన్నదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలోపోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాని చెప్పారు. ఆ పార్టీ ప్రస్తుతం తనకున్న 40 స్థానాలను కూడా నిలబెట్టుకోలేదన్నారు. బీజేపీని వదిలి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పోటీపడుతున్నదని ఎద్దేవాచేశారు. ఆ పార్టీ వవ్యవహార శైలి వల్లే ఇండియా కూటమి చెల్లాచెదురయిందని విమర్శించారు. కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసున్నదని తెలిపారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. హిందీ రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీపడాలన్నారు. బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని మరో ట్వీట్లో పేర్కొన్నారు.
I completely concur with Didi. Congress should introspect on how its attitude has resulted in implosion of the proposed INDIA alliance
Instead of taking on the BJP in UP & Gujarat (where it is a direct face-off) and making something out of it, Congress ends up playing spoiler… https://t.co/7WSIgBlRtG
— KTR (@KTRBRS) February 3, 2024