ఖమ్మం : ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు టేకులపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని నర్సయ్యను చికిత్స నిమిత్తం ఇల్లందు దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ప్రథమ చికిత్స నిర్వహించారు. ప్రమాదంలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తున్నది.