హైదరాబాద్, ఫిబ్రవరి25 (నమస్తే తెలంగాణ): యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు యల్లావుల చక్రధర్యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని డి మాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు యాదవ నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 14 శాతం జనాభా ఉన్న యాదవులకు రెండు లోక్సభ స్థానాలను కేటాయించాలని కోరారు. ఉమ్మ డి ఏపీలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో నూ యాదవులు మంత్రివర్గంలో ఉం డటం ఆనవాయితీగా వస్తున్నదని గు ర్తుచేశారు. ప్రస్తుత మంత్రి వర్గంలో ఒక్కరు కూడా యాదవ మంత్రి లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది యాదవ సామాజిక వర్గాన్ని అవమానించడమేనని తెలిపారు. నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని, యాద వ ఫైనాన్స్ కార్పొరేషన్ హామీని నెరవేర్చాలని కోరారు. లేదంటే యాదవులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.