బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా.. కేసును ఏసీబీకి అప్పగించడాన్ని యాదవ సంఘాల జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఏవైనా ఆరోపణలు, అనుమానాలు ఉంటే మొదట శాఖాపరమైన దర్యాప్తు జరపాలని అన్నారు. కానీ ఏ ఆధారాలు లేకుండా ఏకంగా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడం అంటే రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడటమే అని ఆయన ఆరోపించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ సమర్థవంతమైన మంత్రిగా ప్రజల గౌరవాభిమానాలు పొందారని గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయనపై వేధింపులకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగుజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. బడుగు వర్గాల నాయకులను వేధించి అణగదొక్కాలనే కుట్రలో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసును ఏసీబీ అప్పగించారనేది స్పష్టం అవుతుందని ఆయన అన్నారు.
తలసానిని వేధిస్తే బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని, ఈ కుట్రలను తిప్పి కొడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోసుల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.