యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ధనుర్మాసోత్సవం ప్రారంభంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం తో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరుమాడ వీధులు భక్తులతో రద్దీగా మారాయి.
ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ.54,09,081 ఆదాయం సమకూరిందని ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి తెలిపారు.