Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు 99 గ్రాముల మిశ్రమ బంగారం, 4.170 కిలో మిశ్రమ వెండి కానుకగా సమర్పించినట్లు తెలిపారు. 397 అమెరికన్ డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్స్, కువైట్ 20 దినార్, ఐదు ఇంగ్లండ్ పౌండ్స్, 15 యూరోస్, ఒకటి మలేసియా రింగిట్స్, 50 న్యూజిలాండ్ డాలర్స్, 10 నేపాల్ రూపీస్, ఐదు ఖతార్ రియల్స్, హుండీల్లో కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వివరించారు. సొత్తును ఆలయ ఖాతాల్లో జమ చేసినట్లు ఈవో రామకృష్ణరావు వివరించారు. మరో వైపు పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఎదుర్కోలు, గురువారం తిరుకల్యాణం, శుక్రవారం దివ్య విమాన రథోత్సవం కార్యక్రమాలు జరుగనుండగా.. 25న అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగియనున్నాయి.