యాదాద్రి, నవంబర్ 25 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనంతో మొదలై మంగళనీరాజన మంత్రపుష్పాలతో కల్యాణ కైంకర్యానికి ముగి ంపు పలికారు.
స్వామివారి తిరువారాధన చేపట్టి స్వామివారికి బాలభోగం నివేదన చేసి, నిజాభిషేకం జరిపారు. ఉదయం, సాయంత్రం స్వామి,అమ్మవార్లకు సహస్రనామార్చన, కుంకుమార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమం, సువర్ణపుష్పార్చనలు, తిరువీధి సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. స్వామివారిని సుమారు 18 వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ. 22,90, 043 ఆదాయం సమకూరింది.