యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసి అర్చనలు చేపట్టారు.
కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మ వారికి కుంకుమార్చనలు నిర్వహిం చారు. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మంగా జరుపుకునే సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా స్వామి వారి సుదర్శన నారసింహ హోమం, తిరుకల్యాణ మహో త్సవాలను తాత్కాలికంగా నిలిపివేశారు.