యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అ య్యాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని రకాల సేవలకు మొబైల్లోనే బుకింగ్స్ చేసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. భక్తులు సైతం ఈ -సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. అధికారుల పనితీరుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వెబ్సైట్లో ఈ-సేవలు
యాదాద్రిలో ఈ-సేవలను కూడా అందుబాటు లో ఉంచారు. yadadritemple.telangana. gov.in అనే వెబ్సైట్లో ఈ-సేవలను పొందొచ్చు. ఇందులో నిజాభిషేకం (ఇద్దరికి రూ.800, ఒక్కరికి రూ.400), సహస్రనామార్చన (రూ.300), శ్రీ సు దర్శన నారసింహా మహా హోమం (రూ.1,250), స్వామి వారి కల్యాణం(రూ.1,500), శయనోత్సవం (రూ.వంద), స్వర్ణపుష్పార్చన (రూ.600), సుప్రభాత దర్శనం (రూ.వంద), దర్బార్ సేవ (రూ.516), అష్టోత్తర ఘటాభిషేకం (రూ.వెయ్యి), శ్రీ సత్యనారాయణ స్వామివ్రతం (రూ.800), స్కూటర్ పూజ (రూ.300), ఆటో పూజ (రూ. 400), కారు పూజ (రూ.500), బస్సు, లారీ, ట్రా క్టర్ పూజ (రూ.వెయ్యి), శాశ్వత నిత్య పూజ (పదేండ్లకు రూ. 10 వేలు), శాశ్వత నిత్య నిజాభిషేకం (పదేండ్లకు రూ.15 వేలు), శాశ్వత నిత్య సహస్ర నామ అర్చన (రూ.15వేలు)గా నిర్ణయించారు. గుట్టలో రాత్రి బసచేసే భక్తుల కోసం ప్రత్యేక గదులు ఉన్నా యి. లక్ష్మీ నిలయం నాన్ ఏసీకి రూ. 560, లక్ష్మీ నిలయం నాన్ ఏసీ డీలక్స్ రూ.వెయ్యిగా నిర్ణయించారు. నృసింహ భవనం నాన్ ఏసీ గదులు రూ. 336కు అందుబాటులో ఉన్నాయి. వైటీడీఏ దివ్య సన్నిధి విల్లాలను కూడా అందుబాటులోకి తెచ్చిం ది. ఇండిపెండెంట్ విల్లాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఒక్కో విల్లాకు రోజుకు రూ. 3వేలుగా నిర్ణయించారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు అనుమతి ఉంది. వీటిని booking.ytda.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తులు ఆన్లైన్లో తీసుకొనే తిరు కల్యాణ టికెట్
తిరుమల తరహాలో బ్రేక్ దర్శనం టికెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యా దాద్రి అధికారులు కూడా ఇటీవల బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకొచ్చారు. ఒక్కో టికెట్ ధర రూ. 300గా నిర్ణయించారు. వీఐపీ దర్శనం టికెట్లను ఆన్లైన్లో పొందొచ్చు. వీఐపీ దర్శనం టికెట్ ధర రూ.150గా నిర్ణయించారు. ఆలయంలో జరిపే వివిధ కార్యక్రమాలకు వితరణ చేసేవారికి ఈ-డొనేషన్ సదుపాయం కల్పించారు. దీన్ని ఈ-హుండీ అని పిలుస్తున్నారు. విమాన గోపురం తాపడానికి ఆన్లైన్లో వితరణ చేయొచ్చు. స్వామి వారి వా ర్షిక బ్రహ్మోత్సవాల్లో తిరు కల్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు. దీని ధర రూ.3 వేలుగా నిర్ణయించారు. ఆన్లైన్లో ఈ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న తిరుకల్యాణం జరుగనుంది. ఈ టికెట్పై 500 గ్రాముల అభిషేకం లడ్డూ, రెండు వడలు, ఉత్తరీయం, కనుమును స్వామివారి శేషవస్త్రంగా బహూకరించనున్నారు.
బుకింగ్స్కు ఇవి తప్పనిసరి..
ఆన్లైన్ బుకింగ్ సమయంలో పేరు, పూజ వివరాలు, గోత్రం, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, తేదీ, వెల, ఎన్ని టికెట్లు, చిరునామా తప్పకుండా నింపాల్సి ఉంటుంది. ఆప్షనల్గా నక్షత్రం, రాశి, ఆధార్ నంబర్, వయసు, ఆలయ సందర్శన వేళల వివరాలు తెలుపాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే టికెట్ బుక్ చేసుకునేలా పరిమితి విధించారు. ట్రాన్జాక్షన్ ఐడీ లేదా మొబల్ నంబర్ ద్వారా సేవా రిపోర్టులను ప్రింట్ కూడా తీసుకునే వెసులుబాటు ఉంది.